ప్రారంభమైన 92వ రోజు ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లాలో 92వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం కందుకూరు శివారు నుంచి పాదయాత్రను ఆరంభించారు. జననేత పాదయాత్రకు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
అక్కడి నుంచి వెంకటాద్రి పాలెం, అనంత సాగరం క్రాస్ రోడ్డు, యెద్లూరు పాడు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం యెద్లూరు పాడు కాలనీ మీదుగా పాదయాత్ర ముందుకు సాగుతుంది. అక్కడే వైఎస్ జగన్ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి పెద్ద వెంకన్నపాలెం, విప్పగుంట చేరుకుని 92వ రోజు యాత్రను ముగిస్తారు.