ముగిసిన 303వ రోజు ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 303వ రోజు శిఖబడి క్రాస్ వద్ద ముగిసింది. నేడు జననేత పాదయాత్ర కురుపాం శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి దాసరి పేట, తాళ్లడుమ్మ, చిన్న మేరంగి, అల్లువాడ, పెద తుంబిలి, చిన్న తుంబిలి, జోగులదమ్మ మీదుగా శిఖబడి క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగించారు. ఇవాళ జననేత 10.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు వైఎస్ జగన్ 3,290.9కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.