291వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, బొబ్బిలి(విజయనగరం జిల్లా) : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర సోమవారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం శివారు నుంచి ప్రారంభమైంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు రానున్నాడనీ..అందరీ జీవితాలకూ వెలుగులు తీసుకొచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయన వస్తే గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లో జనం ఆరాట పడుతున్నారు.
జననేత ఎప్పుడు తమ ప్రాంతానికి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. రామభద్రపురం శివారు నుంచి పాదయాత్ర తారాపురం, మిర్తివలస క్రాస్, కొట్టిక్కి జంక్షన్, జిన్నివలస క్రాస్ మీదుగా సాలూరు వరకు కొనసాగనుంది. సాయంత్రం సాలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు.