2న యోగి ఆదిత్యనాథ్ రాక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిసెంబరు 2న రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజు భూపాలపల్లి, ముధోల్, బోధన్, తాండూరు, సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అలాగే డిసెంబరు 5న కరీంనగర్, వరంగల్, గోషామహల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు.