ఓడిపోయినా అభివృద్ధిపై ప్రశ్నిస్తాం: కాంగ్రెస్‌

We lose question whether we lose it: congress - Sakshi

న్యూఢిల్లీ : ఎన్నికలలో ఓడిపోయినా గుజరాత్ అభివృద్ధిపై  ప్రశ్నిస్తామని కాంగ్రెస్‌ అధికార ప్రతినిథి రణదీప్‌ సూర్జేవాలా చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ..పాటీదార్లు, రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. గుజరాత్‌లో ఆరుగురు మంత్రులు ఓడిపోయారని గుర్తు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్ ఓడిపోయారని, మోదీ సొంత ఊరు వాద్ నగర్ అసెంబ్లీలో బీజేపీ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. 

గుజరాత్‌లో మూడంకెల నుంచి రెండకెల సంఖ్యకు పడిపోయిందని వెల్లడించారు. విజయం సాధించిన బీజేపీకి రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు అభినందనలు తెలిపారన్నారు. తాము ఓడిపోయినా, ప్రజల మనసులు గెలిచామని,  కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్న ప్రధానికి గుజరాత్ ప్రజలు గట్టి బుద్ది చెప్పారని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top