జనసేనలో చేరలేదు: విష్ణురాజు

Vishnu Raju Says I Did Not Join In Janasena - Sakshi

సాక్షి, భీమవరం: తాను జనసేన పార్టీలో చేరినట్టు వస్తున్న వార్తలను విష్ణు ఎడ్యుకేషన్‌ సొసైటీ చైర్మన్‌ విష్ణురాజు ఖండించారు. జనసేన పార్టీ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా విష్ణురాజు నియమితులయ్యారనే వార్తలపై ఆయన మంగళవారం స్పందించారు. ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ రెండు మూడు సార్లు కలిసినట్టు తెలిపారు. పవన్‌ తమ విద్యాసంస్థల క్యాంపస్‌కు వచ్చారని గుర్తుచేశారు. విద్య, ఆరోగ్యం, స్మార్ట్‌ సిటీస్‌ అభివృద్ధి గురించి తమ మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు. కేవలం పవన్ సిద్ధాంతాలు నచ్చి అడ్వైజరీ కమిటీలో సలహాలు ఇచ్చేందుకే అంగీకరించానని చెప్పారు. అంతేకాకుండా తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు అతీతంగా నాలెడ్జ్‌ సెంటర్‌ని నడుపుతున్నట్టు పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top