రంగంలోకి విజయవాడ ముఠాలు

Vijayawada Gang in Anantapur For TDP Stickers Cutouts Pasting - Sakshi

ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం  

అనంతపురం న్యూసిటీ: నగరంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు అధికార పార్టీ నాయకులు బరితెగించారు. సోమవారం విజయవాడకు చెందిన 10 బృందాలు నగరంలోని వివిధ కూడళ్లలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాల పోస్టర్లను ఆటోలకు అతికించారు. డ్రైవర్‌కు రూ.200 చెల్లించి ఆటోకు పోస్టర్‌ను అతికించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, శ్రీకంఠం సర్కిల్, క్లాక్‌టవర్, పాతూరు, ఆర్ట్స్‌ కళాశాల, రాంనగర్, రుద్రంపేట తదితర ప్రాంతాల్లో బృందాలు ఏర్పడి పోస్టర్లను అతికించారు. పలు ప్రాంతాల్లో ఆటో కార్మికులు పోస్టర్లు అతికించుకునేందుకు అనాసక్తి చూపారు. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నా జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకోవాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top