‘ఆ జీవో జారీ చేయనందుకు ధన్యవాదాలు’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి తప్పుబట్టారు. మంగళవారం విజయవాడలో ఆశా వర్కర్లతో చంద్రబాబు మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డకు నా గురించి చెప్పండి. పెద్దయ్యాక నాకే ఓటు వేస్తారని పేర్కొన్న తెలిసిందే. దీనిపై ట్విటర్లో స్పందించిన విజయసాయిరెడ్డి.. చంద్రబాబుపై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పుట్టిన పిల్లలకు తన పేరు పెట్టమని జీవో జారీ చేయనందుకు ఏపీ ప్రజలంతా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నారని ఎద్దేవా చేశారు. 68 ఏళ్ల వయసులో మానసిక సమస్యలతో సతమతవుతున్న చంద్రబాబు.. తర్కం లేకుండా మాట్లాడటం సహజమేనని ప్రజలు సర్దుకుంటున్నారని ఆయన విమర్శించారు.
ఇంకా ఏ తల్లిదండ్రులైన వారి పిల్లలకు దేశభక్తుల గురించి, వీరుల గురించి, దేవుళ్ల గురించి చెప్పాలని అనుకుంటారని తెలిపారు. మీలాంటి వారి గురించి చెప్పడానికి ఏ తల్లిదండ్రులు ఇష్టపడరని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు టీవీల్లో కనబడితే పిల్లలు చూడకూడదని తల్లిదండ్రులు వెంటనే ఛానల్ మారుస్తారని విమర్శించారు.
ఆంధ్ర ప్రజలంతా మీకు ధన్యవాదాలు చెబుతున్నారు చంద్రబాబు గారు. పుట్టిన పిల్లలకు మీ పేరు పెట్టమని జిఓ జారీ చేయనందుకు. 68 ఏళ్ల వయసులో మానసిక సమస్యలతో మీరు తర్కం లేకుండా మాట్లాడటం సహజమేనని సర్దుకుంటున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) 16 November 2018