కరోనా వైరస్ నియంత్రణకు ఆయనే ఏదో ఒకటి చెయ్యాలి

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: గాల్లో విమానాలు ఎగుర్తాన్నాయంటే నావల్లే. ఎక్కడో సముద్రంలో ఓడలు తేలిపోతాన్నాయంటే నా వల్లే. అమెరికాలో ఉండే నీ కొడుకుతో మాట్లాడతాన్నావంటే నా వల్లే.. ఈ తీరుగా మాటలు వినిపిస్తే ఠక్కున మనకు గుర్తొచ్చే వ్యక్తి చంద్రబాబు. ఓవైపు చైనా సహా ప్రపంచదేశాలను ప్రాణాంతక కరోనా వైరస్ పీడిస్తున్న తరుణంలో ప్రపంచం మొత్తం బాబు వైపే చూస్తోందంటూ వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.  (ఇంకా చాలా చూడాలి.. కళ్లలో నిప్పులు పోసుకోకు బాబూ..!)

'కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. తుపానులను నియంత్రించగల అతీంద్రియ శక్తులున్న చంద్రబాబు నాయుడి వైపు ప్రపంచమంతా చూస్తోందని ట్వీట్ చేశారు. కరోనా వైరస్ బారినుంచి కాపాడేందుకు ఆయన ఏదో ఒకటి చేయకపోతే ఈ భూమ్మీద మనుషులెవరూ మిగలరని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అందరూ ఆందోళన చెందుతున్నారంటూ' వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ర్యాంకింగ్స్ ఇస్తే ఆయనకు ఆఖరి స్థానం కూడా కష్టమే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top