ఇది బీజేపీ వ్యతిరేకతపై విజయం: సోనియా
న్యూఢిల్లీ: ఛత్తీస్గడ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పట్ల యూపీఏ చైర్పర్సన్, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఇది బీజేపీ అవలంభిస్తున్న వ్యతిరేక రాజకీయాలపై సాధించిన విజయంగా ఆమె అభివర్ణించారు. ఛత్తీస్ఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీతో సాధించుకోగా, మధ్యప్రదేశ్లో మాత్రం అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్, బీఎస్పీ, ఇతర పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
సంబంధిత వార్తలు