టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయం: ఉత్తమ్‌

Uttamkumar Reddy comments on kcr govt - Sakshi

గరిడేపల్లి: రాష్ట్రంలో ఈనెల 7న కేసీఆర్‌ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడటం ఖాయమని, ప్రజాఫ్రంట్‌ అధికారంలోకి వస్తుం దని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌ కుటుంబానికి, 4 కోట్ల రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోవడం ఖాయమైపోయిందన్నారు.

ఇక కేసీఆర్‌ ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకోవడమే మిగిలి ఉందని జోస్యం చెప్పారు. సర్వేలన్నీ ప్రజా ఫ్రంట్‌ విజయం సాధిస్తుందని ఢంకా బజాయించి చెబుతుంటే, వాటిపై కేసీఆర్‌ విరుచుకుపడుతున్నారని, ఇది ఓటమిని అంగీకరించడమేనని ఉత్తమ్‌ పేర్కొన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ నాయకుల వద్ద డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌ కూటమికి ఓట్లు వేయాలన్నారు. తాను రికార్డు స్థాయి మెజార్టీతో గెలవబోతున్నానన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top