కృష్ణమాదిగ అరెస్టు అప్రజాస్వామికం
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అరెస్టు అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆమరణ దీక్ష చేయడం రాజ్యాంగ విరుద్ధమా.. అని ప్రశ్నించారు. మంద కృష్ణ దీక్షకు ప్రభుత్వం ఎందుకు అనుమతించలేదన్నారు.
ఆయనను బేషరతుగా విడుదల చేయాలని, కేసులను ఉపసంహరించుకోవాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వర్గీకరణ కోసం వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్నారు. వర్గీకరణపై సీఎం కేసీఆర్ ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దళిత సంఘాలతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.