సీఎం ఎవరో రాహుల్‌ నిర్ణయిస్తారు: ఉత్తమ్‌

Uttam Kumar Reddy about cm candidate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరుండాలన్నది ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేసులో ఎవరున్నారన్నది చర్చనీయాంశం కానేకాదని వ్యాఖ్యానించారు.

పార్టీలో తనకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారని చెప్పిన ఉత్తమ్‌ రానున్న ఎన్నికల్లో 75 సీట్లు కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే గెలుస్తుందని చెప్పారు. ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంటాం కానీ తాము గెలిచే సీట్లను త్యాగం చేయలేమని, గెలిచే సీట్లలో మాత్రమే పోటీ చేయాలన్నది కూటమిలో ఒప్పందమని అన్నారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని, నెలాఖరులో సోనియా, రాహుల్‌ సభలు జరిగే అవకాశముందని ఆయన తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top