ఒక్క ట్వీట్తో సమస్య పరిష్కారం
సాక్షి, సిద్దిపేటజోన్: గత కొద్ది రోజులుగా పేరుకుపోయిన చెత్తకుప్ప లిఫ్టింగ్కు ఒక్క ట్వీట్ పోస్ట్ పరిష్కారాన్ని చూపింది. పట్టణంలోని సుభాష్నగర్ అంగన్వాడీ కేంద్రం వద్ద బహిరంగంగా చెత్త వేస్తున్నారని సమస్య పరిష్కరించాలని కాలనీకి చెందిన వినోద్ అనే యువకుడు మంగళవారం కలెక్టర్ కృష్ణభాస్కర్కు ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు.
ట్విట్టర్ పోస్ట్
స్పందించిన కలెక్టర్ వెంటనే మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి దాన్ని పరిష్కరించి తనకు ఫొటోను పోస్ట్ చేయాలన్నారు. కలెక్టర్ ఆదేశాలకు కమిషనర్, పారిశుధ్య సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని చెత్తను తొలగించి ఫొటోను కలెక్టర్కు పోస్ట్ చేశారు. గంటలోపు సమస్య పరిష్కారం కావడం పట్ల కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.