అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ సభ్యులు అత్యుత్సాహం

TDP MLAs Protest At AP Assembly Main Entrance - Sakshi

సాక్షి, అమరావతి : అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముగ్గురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని అసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు చేశారు. అంతేకాకుండా మంత్రులు వెళ్లే ద్వారం వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా పాల్గొన్నారు. అయితే మంత్రుల వెళ్లే మార్గంలో టీడీపీ సభ్యులు ధర్నాకు దిగడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ సభ్యులు నిరసన తెలుపడానికి ఇది సరైన మార్గం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం సభలో గందరగోళం సృష్టించేందుకు యత్నించిన టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరిని డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ప్రస్తుత సమావేశాల వరకు సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి : బిల్లులకు టీడీపీ అడుగడుగునా ఆటంకాలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top