చంద్రబాబు వద్దకు నెల్లూరు టీడీపీ లొల్లి!
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా టీడీపీ నేతల పంచాయితీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. మరికాసేపట్లో నెల్లూరు జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు నియోజకవర్గాల విషయంలో టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నెల్లూరు సిటీ స్థానాన్ని తనకు కేటాయించాలని పార్టీ నాయకుడు అజీజ్ కోరుతుండగా.. రూరల్ స్థానం తనకే కావాలని ఆనం జయకుమార్రెడ్డి పట్టుబడుతున్నారు. కోవూరు టికెట్ను పెళ్ళకూర శ్రీనివాస్రెడ్డి అడుగుతున్నారు. ఇప్పటికే నెల్లూరు సిటీ స్థానం టికెట్ను మంత్రి నారాయణకు, రూరల్ టికెట్ను ఆదాల ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు కేటాయించారు. కోవూరు నుంచి మరోసారి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారని టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో టికెట్ ఆశిస్తున్న అసంతృప్త నేతలు చంద్రబాబు వద్ద తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.