కృష్ణా జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌

TDP Leaders Join In YSRCP Krishna - Sakshi

సాక్షి, కృష్ణా: ఎన్నికలు దగ్గర పడటంతో అధికార టీడీపీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నినాని ఆధ్వర్యంలో టీడీపీ నేతలు బురగడ్డ రమేష్‌ నాయుడుతో పాటు ఆయన అనుచరులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు డాక్టర్‌ మాధవితో పాటు  మైనారిటీ నాయకులు అల్తాప్, మేకల గోవింద్, చెన్ను సత్య నారాయణ, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు బొప్పన సుబ్బారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో వైఎస్‌. జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసేవ చేస్తారని మేము భావిస్తున్నామని తెలిపారు. బందరు పార్లమెంట్ తోపాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గలుపునకు కృషి చేస్తామని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top