టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి..
పశ్చిమగోదావరి, ఏలూరు(సెంట్రల్): టీడీపీ ఎస్సీ సెల్ నగర అధికార ప్రతినిధి బోలే సీతారామయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్లోకి చేరారు. గురువారం స్థానిక 5వ డివిజన్లో పర్యటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్, ఎమ్మెల్సీ ఆళ్ల నాని సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. సీతారామయ్యకు పార్టీ కండువాను కప్పి నాని పార్టీలోకి ఆహ్వానించారు. సీతారామయ్యతోపాటు సుమారు 100 మంది టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. డాక్టర్ గోవాడ సన్ని ప్రకాష్, బోలే రత్నం, తిరుపతమ్మ, సీతామహాలక్ష్మీ, సోమేష్, ఎం.రమణ, డి.మహేష్, తుపాకుల నాగేశ్వరరావు, నేతల గణేష్, డీఎం రమణ, కాలే రమేష్, గంధం కుమార్, ఎస్.రాంబాబు తదితరులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీన ర్ ఉన్నమట్ల ఏలిజా, పార్టీ నాయకులు పాల్గొన్నారు.