కొలువుల కొట్లాటకు మద్దతు: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘కొలువుల కొట్లాట’సభకు సీపీఎం తెలంగాణ కమిటీ సంపూర్ణ మద్దతునిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
రాష్ట్రంలో 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తెలంగాణ వస్తే నీళ్లు, నిధులతో పాటు, స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని, అయిదేళ్లలో 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు గంపెడాశతో ఎదురుచూస్తుంటే ప్రభుత్వం వారి ఆశల మీద నీళ్లు చల్లుతోందని అన్నారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో కేవలం 27 వేల 500 ఉద్యోగాలే ఇచ్చి, ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.