త్వరలో రాజకీయ ఫ్రంట్‌: తమ్మినేని

tammineni on Political front - Sakshi

నకిరేకల్‌: స్వచ్ఛమైన రాజకీయాల కోసం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌లను మినహాయించి రాష్ట్రం లోని 27 పార్టీలు, సంఘాలతో కలసి రాజకీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ ఫ్రంట్‌ ఏర్పాటుకు సబ్‌ కమిటీని వేసినట్లు తెలిపారు.

మరో సబ్‌ కమిటీ జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలు, అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై పరిశీలన చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి ఫ్రంట్‌ అభ్యర్థులు బరిలో ఉంటారన్నా రు. జేఏసీ చైర్మన్‌ కోదండరాంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. పాతికేళ్లుగా అనుసరించిన పొత్తుల విధానాన్ని వామపక్ష పార్టీలన్నీ సవరించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో ఇప్పుడు అగ్రకులాల ఆధిపత్యమే నడుస్తోందని, దీనిని ఎదుర్కొనేందుకు వామపక్షాలు, ఇతర సామాజిక వర్గాలు, మేధావులను కలుపుకొని ముందుకు సాగుతామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top