రాష్ట్రంలో ఏ విప్లవమూ రాదు
బస్సు యాత్ర పేరిట కాంగ్రెస్ విహార యాత్ర: మంత్రి తలసాని
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకంటే విప్లవాత్మకమైనవి ఏమున్నాయని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం వస్తుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మంగళవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ ఆవరణలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏ విప్లవమూ రాదు. కాంగ్రెస్ దోపిడీ దొంగల ముఠా. బస్సు యాత్ర పేరిట విహార యాత్ర చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో చర్చకు సిద్ధం’ అని మంత్రి తలసాని సవాల్ విసిరారు.