‘నిరంతరం ఓటరుతో టచ్‌లో ఉండండి’

Take Party Theories Into People YSRCP Leader Asks Activists - Sakshi

సాక్షి, కడప : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బూత్‌ లెవల్‌ సభ్యులకు పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సూచించారు. బుధవారం ఆయన పార్టీ బూత్‌ లెవల్‌ కార్యకర్తలతో మాట్లడారు. బూత్‌ లెవల్‌ సభ్యులు కీలకమైన స్థానాల్లో ఉన్నారని, బూత్‌ కన్వీనర్‌ కెప్టెన్‌ లాంటి వాడని అన్నారు. ప్రజల్లో గర్వంగా తలెత్తుకునే నాయకత్వం పార్టీకి ఉందని చెప్పారు.

పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాటను ప్రతి ఇంటికి వెళ్లేలా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త నిరంతం ఓటరుకు టచ్‌లో ఉండాలని చెప్పారు. 2019లో 175 సీట్లలో 150 సీట్లను పార్టీ సాధించే దిశగా బూత్‌ కమిటీలు వ్యవహరించాలని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top