మంగళగిరిలో సర్వే కలకలం

Survey Team Hulchul At Mangalagiri Constituency - Sakshi

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో సర్వే కలకలం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ను టీడీపీ మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఈ సర్వే జరుగుతుంది. ఖమ్మం, హైదరాబాద్‌ నుంచి వచ్చిన 30 మంది సభ్యుల బృందం ఈ సర్వే చేపట్టింది. ప్రభుత్వ పథకాలు, ఎవరిని ఎన్నుకుంటారు, ఏ టీవీ చూస్తారు, ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పనితీరుపై ప్రశ్నలు అడుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. ఓటర్ల జాబితాను దగ్గర ఉంచుకుని..  పన్నెండు ప్రశ్నలతో సర్వే కొనసాగిస్తున్నారు. 

ఏపీలో పలు దొంగ సర్వేలు జరగడం, ఏపీ​ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఐటీగ్రిడ్స్‌ అనే కంపెనీ చేతికి వెళ్లడం ఇప్పటికే ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. లోకేశ్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న నియోజకవర్గంలో ఇలాంటి సర్వేలు చేపట్టడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top