మహాకూటమి బీసీల ద్రోహకూటమి: జాజుల

Srinivas goud commented over mahakutami - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ జనాభాకు తగినట్లుగా టికెట్లు కేటాయించకుండా మహాకూటమి బీసీలకు అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్‌ మండిపడ్డారు. అది మహాకూటమి కాదని బీసీల ద్రోహ కూటమని ఆయన వ్యాఖ్యానించారు.

కూటమిలోని పెద్దలు ఒక సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్‌ కేటాయించలేదన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈనెల 16న రాష్ట్ర వ్యాప్త నిరసన ప్రదర్శనలకు పిలుపునిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top