చంద్రబాబు అవినీతిపై చర్యలు తీసుకోవాలి : సోము వీర్రాజు

Somu Veerraju Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, రాజమండ్రి : చంద్రబాబు నాయుడు మయాజాలం కారణంగానే రాజధానిపై ఇంకా గందరగోళం కొనసాగుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయంలో జరిగిన వేల కోట్ల అవినీతిపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పచ్చగడ్డి పథకంలోనూ టీడీపీ నేతలు వేల కోట్లు మేసేశారని విమర్శించారు. అవినీతి చేసి జైల్లో ఉండాల్సిన టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గురించి పూర్తిగా స్టడీ చేశానని, ఆయన సరైన వ్యక్తి కాదని అన్నారు. ఏపీ రాజధానిపై కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీకి మరోసారి అవకాశం ఇవ్వబోమన్నారు. 2024 ఎన్నికల్లో భారతీయతే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని వీర్రాజు పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top