'అపుడు యూపీఏ.. ఇపుడు ఎన్డీఏ'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో అప్పడు యూపీఏ, ఇప్పుడు ఎన్డీఏ మోసం చేసిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా యూపీఏ అయిదేళ్లంటే కాదు.. పదేళ్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని సోమిరెడ్డి ఆరోపించారు.
14వ ఆర్దిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిందని పేర్కొనడం విడ్డూరమని మంత్రి ఆరోపించారు. దేశాన్ని మోదీ పాలిస్తున్నారా లేక 14వ ఆర్థిక సంఘం పాలిస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.