లౌకిక శక్తులు ఐక్యంగా పోరాడాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: దేశంలో హిందుత్వ, ఫాసిస్టు, మతోన్మాద శక్తుల ఆగడాలను ప్రతిఘటించేందుకు వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఐక్యంగా పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపిచ్చారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లోని దేశోద్ధారక భవన్లో ‘మతోన్మాద రాజకీయాలు–లౌకిక ప్రజాస్వామ్య శక్తుల కర్తవ్యం’పై సదస్సు నిర్వహించారు.
చాడ మాట్లాడుతూ.. భిన్న మతాలకు, భిన్న సంస్కృతులకు, సంప్రదాయాలకు నిలయమైన భారత్లో మతోన్మాదాన్ని సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని మత ఛాందసవాద పార్టీలు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని విమర్శించారు. వీక్షణం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ మతం పేరుతో దుర్మార్గమైన అనాగరిక చర్యలకు మతతత్వ శక్తులు పాల్పడుతున్నాయని కశ్మీర్లోని అసీఫా ఉదంతమే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు