వైఎస్సార్సీపీకే మా మద్దతు : సమతా సైనిక్దళ్
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సమతా సైనిక్దళ్ (ఎస్ఎస్డీ) మద్దతు ప్రకటించింది. దళిత, బహుజనుల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని ఎస్ఎస్డీ నాయకులు తెలిపారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో దళితవర్గాలపై దాడులు పెరిగాయని, టీడీపీ పాలనలో తమకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ దళిత, బహుజనులపట్ల చూపుతున్న వైఖరిని స్వాగతిస్తున్నామని ఎస్ఎస్డీ రాష్ట్ర నేతలు మహేశ్వరరావు, పులి సరేంద్ర, డాక్టర్ విశ్వబాద్, డాక్టర్ సరేంద్ర పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అండగా ఉంటామని, వైఎస్ జగన్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.