‘వైఎస్‌ జగన్‌ - చంద్రబాబు మధ్య స్ట్రెయిట్‌ ఫైట్‌’

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుపై సజ్జల ఫైర్‌

సాక్షి, విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీల ప్రజయోజనాలకు చంద్రబాబు హరించి వేస్తున్నారని సజ్జల విమర్శించారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీల అమలును మరచిన చంద్రబాబు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు.  వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ‘వంచన, నయవంచన’ ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘వైఎస్‌ జగన్‌కు చంద్రబాబుకు స్ట్రెయిట్‌ ఫైట్‌ జరగబోతోంది. వైఎస్‌ జగన్‌కు అవకాశం ఇస్తే అభివృద్ధి, సంక్షేమం ఉంటాయి. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని బ్లూ ప్రింట్‌ రెడీ చేసుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అలుముకున్న చీకట్లను పారద్రోలాలంటే వైఎస్‌ జగన్‌కు నాయకత్వం అందించాలని అన్నారు. ‘ప్రజల సమస్యలు అసలే పట్టవు అనే తీరుగా టీడీపీ పాలన సాగిస్తోంది. సమస్యలు తీర్చకపోగా కొత్త సమస్యలు సృష్టించే విధంగా చంద్రబాబు పాలన తయారైంది. ఈ అరాచక పాలనతో రాష్ట్ర ప్రజానీకం విసిగిపోయారు. బాబు పాలన ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు’అని సజ్జల అన్నారు. విజయవాడలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. వచ్చే నాలుగు నెలలు పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top