ప్రజాసంకల్ప యాత్రలో రాంబాబు

Rambabu On Praja sankalpa yatra - Sakshi

మందమర్రిరూరల్‌(చెన్నూర్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్త్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి సునార్కర్‌ రాంబాబు పాల్గొన్నారు.

మంగళవారం అమలాపురం వద్ద జగన్‌తోపాటు యాత్రలో పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్బంగా రాంబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ పాదయాత్రలో ప్రజలంతా మమేకమై పాల్గొంటున్నారని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా పార్టీ బలోపేతానికి  కృషిచేయాలని సూచించారని తెలిపారు.  

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top