రామ్మూర్తికి వైఎస్‌ జగన్‌ హామీ

Ramamurthy met Jagan Mohan Reddy, shared his grievances - Sakshi

సాక్షి, శ్రీకాళహస్తి: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేపడుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఏర్పేడు మండలం వికృతమాల గ్రామానికి చెందిన రామ్మూర్తి కలిసి.. తన సమస్యను విన్నవించుకున్నారు. రామ్మూర్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. విమానాశ్రయ నిర్మాణం కోసం ఆయన భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కొంది. దీంతో భూమి కోల్పోయిన ఆయనకు కనీసం సరైన పరిహారం కూడా ఇవ్వలేదు. దీనిపై అధికారుల చుట్టూ తిరిగినా, కోర్టులకు వెళ్లినా లాభం లేకపోయింది. దీంతో పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలిసి.. సహాయం చేయాల్సిందిగా రామ్మూర్తి అభ్యర్థించారు. స్పందించిన వైఎస్‌ జగన్‌ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన సమస్యను పరిష్కరించి.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top