పార్టీ ఏర్పాటు పనులు 90% పూర్తి

Rajinikanth maintains suspense on timing of political party formation - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ పార్టీ ఏర్పాటుపై దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చెప్పారు. పార్టీకి సంబంధించి పనులు దాదాపు పూర్తయినట్లేనని చెప్పారు. డిసెంబర్‌లో తిరుచ్చిరాపల్లిలో రజనీ పార్టీ తొలి మహానాడుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఏర్పాట్ల బాధ్యతను రాజశేఖర్‌ అనే రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారికి అప్పగించారు. తిరుచ్చి మహానాడు ఏర్పాట్లపై తూత్తుకూడికి చెందిన స్టాలిన్‌ నాయకుడిగా పదిమంది సభ్యులతో కూడిన బృందం ఏర్పాటైంది. కాగా, ‘మీ టూ’ఉద్యమంపై రజనీకాంత్‌ స్పందించారు. ఆ ఉద్యమం మహిళలకు మంచిదే, అయితే అది దుర్వినియోగం కాకూడదని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top