నేడు కర్నూలు జిల్లాలో రాహుల్‌ పర్యటన

Rahul Gandhi tour in Kurnool district today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ /అమరావతి/కర్నూలు (ఓల్డ్‌సిటీ): కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు ఆయన పెద్దపాడులో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నివాసాన్ని సందర్శించనున్నారు. ఒంటి గంటకు బీవై రెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో విద్యార్థులతో ముచ్చటించి.. 2:45కు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు.

అనంతరం కోట్ల నివాసాన్ని సందర్శిస్తారు. 3:45కు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, తెలంగాణ మాజీ ఎంపీ వి.హనుమంతరావు సోమవారం పర్యవేక్షించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top