నేడు కర్నూలు జిల్లాలో రాహుల్ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ /అమరావతి/కర్నూలు (ఓల్డ్సిటీ): కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు ఆయన పెద్దపాడులో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నివాసాన్ని సందర్శించనున్నారు. ఒంటి గంటకు బీవై రెడ్డి కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో ముచ్చటించి.. 2:45కు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు.
అనంతరం కోట్ల నివాసాన్ని సందర్శిస్తారు. 3:45కు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి, తెలంగాణ మాజీ ఎంపీ వి.హనుమంతరావు సోమవారం పర్యవేక్షించారు.