పదవి పోతుందని మోదీకి భయం: రాహుల్
న్యూఢిల్లీ: పదవి నుంచి దిగిపోయే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. ‘మిషన్ శక్తి’పై మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ఆ విషయం స్పష్టంగా తెలిసిందని రాహుల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగంతో రాహుల్ సమావేశమయ్యారు.
అక్కడ ఆయన ప్రసంగిస్తూ పేదలకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందన్న విషయాన్ని మోదీ గుర్తించారన్నారు. ‘తన ప్రసంగం కోసం మోదీ దేశాన్ని 45 నిమిషాలపాటు నిరీక్షింపజేశారు. ఆయన ము ఖాన్ని మీరు గమనించారా? పదవి నుంచి దిగిపోయే సమయం వచ్చిందని ఆయన భయపడుతున్నారు’అని రాహుల్ పేర్కొన్నారు.