500 కి.మీ మార్క్‌ దాటిన ప్రజాసంకల్పయాత్ర

PrajaSankalpaYatra Crosses 500 Km's Mark in Ananthapur - Sakshi

సాక్షి, అనంతపురం(గొట్లూరు) : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం 500 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు గ్రామానికి చేరుకోవడంతో 500 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి  అయింది. ఈ సందర్భంగా ఆయన గొట్లూరులో మొక్కను నాటారు. కాగా, ప్రజల చెంతకు కాలినడకన బయల్దేరిన వైఎస్‌ జగన్‌కు వినతులు వెల్లువలా వస్తున్నాయి.

శనివారం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్‌ నేతలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారని చెప్పారు. ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వైఎస్‌ జగన్‌కు విన్నవించారు. అంతకుముందు మల్కాపురం క్రాస్‌ వద్ద ధర్మవరం మైనార్టీ నేత అబ్దుల్‌ రవూఫ్‌, అనుచరులు వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top