66వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 66వ రోజు చిత్తూరు జిల్లాలోని చిందేపల్లి వద్ద ముగిసింది. నేడు వైఎస్ జగన్ 12.8 కిలోమీటర్లు నడిచారు.
శనివారం ఉదయం 8.30 గంటలకు వైఎస్ జగన్ కుక్కలవారి కండ్రిగ నుంచి పాదయాత్రను ప్రారంభించి, వెంకటాపురం క్రాస్, కుమ్మరమిట్ట, మెదుగుపాలెం క్రాస్, ఏర్పేడు, మేర్లపాక క్రాస్ మీదుగా చిందేపల్లి వరకూ ఈ రోజు పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు వైఎస్ జగన్ 896.4 కిలోమీటర్లు నడిచారు.
సంబంధిత వార్తలు