37వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 37వ రోజు షెడ్యూల్ విడుదల అయింది. పార్టీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం యాత్ర షెడ్యూల్ను విడుదల చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామ శివారులో ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది.
అక్కడినుంచి తుమ్మల, తిప్పేపల్లి క్రాస్, రావులచెరువు ఎస్సీ కాలనీల మీదుగా ప్రజాసంకల్పయాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు రావులచెరువు గ్రామంలో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. మధ్యాహ్న భోజన విరామ అనంతరం ఎర్రగుంటపల్లి తండా క్రాస్కు చేరుకుంటారు. అక్కడినుంచి రావులచెరువు తండా, వెంకటతిమ్మాపురంల మీదుగా దర్శినమలకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా, 36వ రోజు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ 16.3 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
ఉప్పునేసినపల్లి క్రాస్ రోడ్ వద్ద 36వ రోజు ప్రజాసంకల్పయాత్ర చిగిచెర్ల, వసంతపురం క్రాస్, గరుడంపల్లి క్రాస్, బడన్నపల్లి, మల్కాపురం క్రాస్ల మీదుగా గొట్లూరు వరకూ సాగింది.
సంబంధిత వార్తలు