ప్రజాసంకల్పయాత్ర 174వ రోజు షెడ్యూల్‌

PrajaSankalpaYatra 174th Day Scheduele Released - Sakshi

సాక్షి, భీమవరం : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 174వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. సోమవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా విస్సాకోడేరు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. గోరనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, నందమూరు గరువుల మీదుగా వీరవాసరం చేరుకుంటారు.

అక్కడి నుంచి తలతాడి తిప్ప, బొబ్బనపల్లి, మత్స్యపురి వరకూ జననేత పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి వైఎస్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వారు జననేత వైఎస్‌ జగన్‌ను నేరుగా కలుసుకుని మాట్లాడవచ్చు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

భీమవరంలో ముగిసిన పాదయాత్ర
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 173వ రోజు ప్రజాసంకల్పయాత్ర  భీమవరంలో ముగిసింది. ఆదివారం ఉదయం ఉండి నియోజకవర్గంలోని గొపల్లె నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పెదఅమిరం, చిన అమిరం మీదుగా భీమవరం వరకు జననేత పాదయాత్ర కొనసాగింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top