శ్వేతపత్రం విడుదల చేయండి: పొన్నం

Ponnam prabhakar on trs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇంత వరకు అమలు చేసిన వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల వంటి హామీలు ఎంత వరకు అమలయ్యాయో ప్రజలకు వివరాలివ్వాలన్నారు.

కాంగ్రెస్‌ నిర్మించిన ప్రాజెక్టులకు హెడ్‌ రెగ్యులేటరీలు కట్టి మొత్తం ప్రాజెక్టులు తామే కట్టినట్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోకుండా థర్డ్‌ ఫ్రంట్‌ పేరుతో సీఎం రాష్ట్రాలు చుట్టొస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో కోట్లు దోచుకుంటున్న కేసీఆర్‌ను పొగుడుతున్న గవర్నర్‌ తన పేరును కల్వకుంట్ల నరసింహన్‌గా మార్చుకోవాలని సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top