మోదీ అండ ఉన్నంతవరకు మాకేం కాదు!

PM Narendra Modi is with us, nobody can shake AIADMK: Rajendra ... - Sakshi

తమిళనాడు మంత్రి రాజేంద్ర సంచలన వ్యాఖ్యలు  

అండిపట్టి: ప్రధాని మోదీ మద్దతు ఉన్నంతవరకు అన్నాడీఎంకేను ఎవ్వరూ ఏమీ చేయలేరని తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) రెండాకుల గుర్తును తమకే కేటాయిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓ పార్టీ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి రాజేంద్ర మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ మన వెంట ఉన్నారు. ఎవ్వరూ మన పార్టీని ఏం చేయలేరు.

ప్రతిపక్ష డీఎంకేతో సహా ఎవ్వరూ అన్నాడీఎంకేను నాశనం చేయలేరు’ అని వ్యాఖ్యానించారు. దాదాపు 92 శాతం జనరల్‌ కౌన్సిల్‌ సభ్యుల మద్దతు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేటు డైరీలు పాలలో హానికారక రసాయనాలను కలుపుతున్నాయని గతంలో ఆరోపించి రాజేంద్ర వార్తల్లో నిలిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top