సీఎం సాహసోపేత నిర్ణయం

Perni Nani Comments On Chandrababu And Pawan Kalyan - Sakshi

మూడు రాజధానులపై అన్ని ప్రాంతాల ప్రజలు హర్షిస్తున్నారు

ఉదయం సినిమాలోను.. సాయంత్రం రాజకీయాల్లోను పవన్‌ నాయుడు యాక్షన్‌

మీడియాతో మంత్రి పేర్ని నాని 

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని మంత్రి పేర్ని నాని ప్రశంసించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపట్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. వివిధ ప్రాంతాల్లోని ప్రజలు మిఠాయిలు పంచుకుని ప్రదర్శనలు నిర్వహించి సంబరాలు చేసుకుంటున్నారన్నారు. అనేకమంది ఈ మెయిల్స్, ట్విట్టర్‌లో వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారన్నారు.

రాష్ట్రంలోని వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లోని వెనుకడిన ప్రాంతాలు సీఎం నిర్ణయానికి మద్దతు పలుకుతున్నాయని పేర్ని చెప్పారు. కాగా, జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన బాగా చేస్తున్నారని.. మీరు పాలన చేసుకోండి నేను సినిమాలు చేసుకుంటానని చెప్పిన పవన్‌నాయుడు రెండో రోజుకే మాట మార్చారని నాని ఎద్దేవా చేశారు. ఈ రోజు ఉదయం సినిమాలో యాక్షన్‌ చేసిన పవన్‌నాయుడు.. సాయంత్రానికి రాజకీయాల్లో పాల్గొనడం వెనుక చంద్రబాబుతో కుదుర్చుకున్న ఒప్పందమేనని మంత్రి ఆరోపించారు. 

మూడు రాజధానుల విషయంలో కేంద్రం నుంచి అనుమతులు తీçసువాల్సిన అవసరంలేదని, ఏది అవసరమో దానికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకుంటామని ఆయన చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top