చింతమనేనిని అనర్హుడిగా ప్రకటించాలి
వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని
సాక్షి, హైదరాబాద్ : కేసుల్లో ఇరుక్కుని శిక్షపడిన పశ్చిమ గోదా వరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను తక్షణమే అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని వెంకటేశ్వరరావు (నాని) డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాల యంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుదీర్ఘ అనుభం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు జైలుశిక్ష పడిన ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలని తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ శిక్షపడిన ప్రజాప్రతినిధిని పదవిలో కొనసాగిం చకూడదని పేర్ని గుర్తుచేశారు.