రావి వెంకటరమణ యాప్‌ ప్రారంభం

People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

గుంటూరు : వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ యాప్‌ను వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు.  నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు పి. నాగసురేష్, పి. గోకుల్, హారీఫ్‌లు ఈ నూతన యాప్‌ను రూపొందించారు.  గూగుల్‌ ప్లే స్టోర్‌లో రావి వెంకటరమణ అని టైప్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.యాప్‌ ద్వారా రావి వెంకటరమణకు సంబంధించిన ఫొటోలు, కార్యక్రమాల వివరాలను తెలుసుకోవటమే కాకుండా,  ఫిర్యాదులను తెలియజేయవచ్చన్నారు. ఇవి రావి వెంకటరమణ ఫోన్‌ నంబరుకు చేరతాయని తద్వారా వెంటనే పరిష్కారానికి అవకాశం ఉంటుందని యాప్‌ను రూపొందించిన యువకులు తెలిపారు. ఈ సందర్భంగా యువకులను జగన్‌ అభినందించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top