మా వెలుగు నువ్వే..
నెల్లూరు(సెంట్రల్): అదిగదిగో సామాన్యుడి గుండె చప్పుడు ఆయనొస్తున్నాడంటే ప్రతి ఒక్కరికీ ఎదో ఆశ.. కొత్త వెలుగు కోసం శ్వాస.. అన్నదాతలకు జీవితంపై భరోసా కల్పించేందుకు, విద్యార్థులు, నిరుద్యోగులు, అక్కచెల్లెమ్మల మోములో ఆనందాలు పూయించేందుకు.. కూడు, గూడు లేక అభద్రతతో నలిగిపోతున్న సామాన్య జీవిలో ధైర్యం నూరిపోసేందుకు.. రాజన్న ముద్దుబిడ్డ, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రాంతానికి వచ్చాడని తెలిసి చిన్నా, పెద్దా తేడా లేకుండా కలిశారు. జనసంద్రమై కదిలారు. మీ వెంటే మేమంటూ.. కొండంత అండగా నిలిచారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మంగళవారం ఉదయగిరి నియోజకవర్గంలో కొనసాగింది. కలిగిరి మండలం పెద్ద కొండూరు నుంచి ప్రారంభమైన యాత్ర పెద్దపాడు, వీరారెడ్డిపాళెం, పోలంపాడు, కలిగిరి వరకు కొనసాగింది. కలిగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి జననేత వైఎస్ జగన్ ప్రసంగించారు.
మరిన్ని వార్తలు