అనంత అభిమానం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర సోమవారం ఉదయగిరి నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగింది. కలిగిరి మండలం అనంతపురం నుంచి ప్రారంభమైన యాత్ర సిద్ధనకొండూరు, పరికోట, అయ్యపురెడ్డిపాళెం మీదుగా పెద్ద కొండూరు వరకు కొనసాగింది. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అనంతపురం వాసులతోపాటు అన్ని గ్రామాల ప్రజలు కొండంత అభిమానంతో ఆత్మీయ స్వాగతం పలికారు. పలువురు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన వైఎస్ జగన్ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినవెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.