ఈ నెల 20 వరకు అభ్యర్థుల ఖరారు: ఉత్తమ్‌

PCC Leader Uttam Kumar Reddy Comments Over Lok Sabha Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షడు రాహుల్‌ గాంధీ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ బరిలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై, రాష్ట్రాల కమిటీల గురించి చర్చించారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20వ తేదీ వరకూ అభ్యర్థులను ఖరారు చేసి ఏఐసీసీకి జాబితా పంపాలని రాహుల్‌ గాంధీ ఆదేశించారన్నారు. అంతేకాక మ్యానిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలనే అంశం గురించి కూడా చర్చించినట్లు తెలిపారు. పొత్తులపై కూడా చర్చ జరిగిందని.. కానీ తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. సీనియర్‌ నేతలతో చర్చించిన తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top