చర్చిలో పవన్‌ దంపతుల ప్రార్థనలు

Pawan Special Prayers at Secunderabad Church - Sakshi

హైదరాబాద్‌: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సికింద్రాబాద్‌లోని సెయింట్‌ మేరీస్‌ చర్చిలో ప్రత్యే క ప్రార్థనలు చేశారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు సతీమణి అన్నా లెజ్నేవా, భారత్‌లో పోలాండ్‌ దేశ రాయ బారి ఆడమ్‌ బురాకోవస్కీతో కలసి చర్చికి వచ్చిన పవన్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారు. వీరి వెంట భారతీయ జీవనశైలి, విద్యావిధానాన్ని అధ్యయనం చేయడానికి వచ్చిన 20 ఏళ్లలోపు వయస్సుగల విద్యార్థుల బృందం, పోలాండ్‌ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

పవన్‌  తన భార్యతో రావడంతో వారిని చూడటానికి జనం ఆసక్తిని కనబరిచారు. అనంతరం ప్రశాసన్‌నగర్‌ జనసేన కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌తో ఆడమ్‌ బురాకోవస్కీ, ఆ దేశ ప్రతినిధులు సమావేశమయ్యారు. జనసేన మీడియా హెడ్‌ పి.హరి ప్రసాద్‌ ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top