రాజధాని రైతులు పోరాటానికి సిద్ధంగా ఉండండి: పవన్
సాక్షి, అమరావతి: బహుళ పంటలు పండే భూములు కాపాడుకునేందుకు రాష్ట్ర రాజధాని రైతులు పోరాటానికి సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం రాజధానిలో మరో 2,400 ఎకరాలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోందంటూ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంపై పవన్ స్పందించారు.
‘తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగానే రైతులను తరలించాలనుకుంటోందా? అదే నిజమైతే బహుళ పంటలు పండే భూములు కాపాడుకోవడానికి రైతులు పోరాటానికి సిద్ధం కావాలి’ అని పవన్ పిలుపునిచ్చారు.