వెంకన్న సాక్షిగా పవన్‌ అబద్దాలు

Pawan Kalyan Lie Nailed - Sakshi

పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

సాక్షి, తిరుపతి: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. తాము చేసిన చేసిన పనుల గురించి అధికార పక్షం, తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి విపక్షాలు ప్రచారం చేసుకుంటాయి. పాలనా వైఫల్యాలపై అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ దీనికి భిన్నం. (చదవండి: పవన్‌ కల్యాణ్‌.. మందలగిరి మాలోకాన్ని మించిపోయారు)

ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఒంటికాలిపై లేస్తూ అధికార టీడీపీని మాత్రం సుతిమెత్తగా విమర్శిస్తుంటారు. చంద్రబాబును పల్లెత్తు మాట అనకుండా వైఎస్‌ జగన్‌పై మాత్రం అసత్య ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతిలో గురువారం జరిగిన ఎన్నికల బహిరంగసభలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు తాజా రుజువు. తిరుమలలో వైఎస్‌ జగన్‌ ప్రొటోకాల్‌ పాటించలేదని, చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లిపోయారంటూ వెంకన్న సాక్షిగా నిందారోపణలు చేశారు. అయితే వాస్తవం దీనికి విరుద్ధంగా దీనికి ఉంది. కావాలంటే ఈ వీడియో చూడండి..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top