6 నుంచి ‘పల్లె పల్లెకూ.. సీపీఐ’: చాడ
సాక్షి, హైదరాబాద్: సామాజిక తెలంగాణ, సమగ్రాభివృద్ధి కోసం అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 3 వరకు రెండు నెలలపాటు సీపీఐ పోరుబాట పేర రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర ప్రారంభిం చనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్లను శుక్రవారం కలసి ఆహ్వానించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిలకు ఆహ్వానపత్రాలు అందజేశారు. ‘పల్లెపల్లెకూ సీపీఐ’ అన్న నినాదంతో జనగామ నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తు న్నామని చెప్పారు.
సంబంధిత వార్తలు